ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 32వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, రాయపాడు గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 32వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మండలంలోని రాయపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ కార్యక్రమంలో కొనసాగగా, జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ..  జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేర్చే బాధ్యత జనసేన పార్టీదని, రైతులకు లాభసాటి ధర కల్పన జనసేన సంకల్పం. రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు “గాజుగ్లాసు” కు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసుకుందాం అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తాండ్ర శ్రీను, వెంకయ్య పాల్గొన్నారు.