జనసేన క్రియాశీలక సభ్యునికి ప్రమాద భీమా అందజేత

అమలా పురం: అమలాపురానికి చెందిన జనసైనికుడు తోట కిరణ్ ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స చేయించుకున్నారు. తోట కిరణ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు, ఆయన పంపించిన 28 వేల రూపాయలు చెక్కును అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో కిరణ్ కుటుంబ సభ్యులకి అందచేసారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ప్రమాదం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు భరోసాగా అండగా ఉండే కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ ప్రమాద భీమా పథకం అని ఇది కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసైనికులు పట్ల, కార్యకర్తల పట్ల ప్రేమతో వారి కుటుంబాలకు భరోసాగా ఏర్పాటు చేసిన పథకం అని అందులో భాగంగానే తోట కిరణ్ కుటుంబానికి చెక్కు ఇవ్వడం జరిగిందని రాజబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్ జనసేన పార్టీ నాయకులు ఆకుల బుజ్జి, సుధా చిన్నా, కుంపట్ల వెంకట రమేష్, తూము రమేష్, సత్తి శ్రీనివాస్, వలవల చిన్న, పొనకల ప్రకాష్, నూకల వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.