అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం మట్టాడిపాలెం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి స్వామిని దర్శించి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి వెంట జక్కం శెట్టి బాలకృష్ణ (పండు) సానబోయిన వీరభద్రరావు మొదలగువారు పాల్గొన్నారు.