కందుల దుర్గేష్ ను అభినందించిన బత్తుల

రాజమండ్రి: 2024 ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్న జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీకి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సారథ్యంలో సమన్వయ కమిటీ సభ్యునిగా నియమించబడ్డ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ను కలిసి గౌరవపూర్వకంగా వారిని గజ మాలతో సత్కరించిన రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. అనంతరం రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో చేపట్టబోయే పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట రాజానగరం జనసేన పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.