నరసన్నపాలెం గ్రామంలో పవన్‌ కళ్యాణ్‌ చిత్ర పటానికి పాలాభిషేకం

పోలవరం నియోజకవర్గం: చింతలపూడి వేదికగా ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లాలో 41 మంది కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు జనసేన అధ్యక్షులు లక్ష రూపాయిలు చొప్పున ఆర్ధిక సహాయం అందించినందుకు కృతజ్ఞతగా… పోలవరం నియోజకవర్గం కొయ్యలగుడెం మండలం, నరసన్నపాలెం గ్రామానికి చెందిన జమ్మి సత్యనారాయణ భార్య జమ్మి సత్యవతి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, ఇంచార్జి చిర్రి బాలరాజు, సీనియర్‌ నాయకులు చోడిపిండి సుభ్రమణ్యం, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, మండల అధ్యక్షులు తోట రవి, అప్పన ప్రసాద్‌, బుట్టాయిగుడెం మండల అధ్యక్షులు తెల్లం రవిప్రసాద్, గ్రామ అధ్యక్షులు మందపాటి వెంకటేశ్వరావు, అల్లం సత్తిరాజు, దాకారపు మధు, తాడేపల్లి గోపి, సుంకర రాజేష్‌, కోనే శివ, అడపా శ్రీను, రామిన శ్రీను అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు మరియు గ్రామ జనసైనికులు పాల్గొని విజయంవతం చేసారు.