సంగారెడ్డి జిల్లా లో మరో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులో సాల్వెంట్ గోడౌన్‌లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు గోడౌన్ నలువైపులా వ్యాపించడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుమ్మడిదల ప్రాంతంలో ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీలే ఉండటంతో ఈ ప్రమాదం స్థానికులలో తీవ్ర భయాందోళనలకు కారణమైంది.

సాల్వెంట్స్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.