భట్లపాలిక జనసేన గ్రామకమిటి నియామకం

రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు గంగవరం మండలం అధ్యక్షులు చిర్రా రాజకుమార్ గారు కలిసి సోమవారం రాత్రి గంగవరం మండలం భట్లపాలిక గ్రామం వెళ్లి గ్రామ కమిటీని వేయడం జరిగింది. భట్లపాలిక గ్రామ అధ్యక్షులుగా గెడ్డం శ్రీనివాస్ ని నిర్ణయించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటు చేసిన యాక్సిడెంటల్ భీమా 5,00,000 రూపాయల కిట్లను అందజేయడం జరిగింది. మరియు రంగా జయంతి సందర్భంగా రంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో భాగంబా పోలిశెట్టి చంద్రశేఖర్ కేక్ కటింగ్ చేసి రంగా జయంతి వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి సంపత్, ఏరుపల్లి ఎంపీటీసీ సాక్షి శివకృష్ణ కుమార్, భట్లపాలిక గ్రామ జనసేన నాయకులు గురుమల్ల క్రిష్ణ వంశీ తదితర గ్రామ జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.