పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై హిందూపురం జనసేన ఆధ్వర్యంలో నిరసన

హిందూపురం జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి.. బస్టాండ్ ఆవరణలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి.. ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందించడం జరిగింది. బస్ చార్జీలను తగ్గించకపోతే జనసేన పార్టీ తరపున నిరసనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నిమ్మకాయల రాము, సీనియర్ నాయకులు మల్లెపూల మధు, జిల్లా సంయుక్త కార్యదర్శి కొల్లకుంట శేఖర్, హిందూపురం, చిలమత్తూరు మండల అధ్యక్షులు చక్రవర్తి, చిన్నా ప్రవీణ్, నాయకులు గాజుల నాగభూషణం, నాగరాజు, బొంచేరువు భాస్కర్, చలపతి, ఇందిరానగర్ విజయ్, మనోహర్, పవన్ కుమార్, ప్రభు, నవీన్, లింగరాజు, పరిగి మధు, హనుమంతు, వెంకటేష్, ప్రశాంత్, నాగేంద్ర, మహేష్, హరీష్, మారుతి, సంతోష్, శేఖర్ కన్నా, నటరాజ, మౌలినాథ్, మునీర్, రవితేజ మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.