జగనన్న కాలనీలు వాగులు, వంకలను తలపిస్తున్నాయి: చందు, సుందర్

నంద్యాల: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ లు జనసైనికులతో కలిసి ఆదివారం జగనన్న కాలనీలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో ఇక్కడ ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతుందని, ఈ కాలనీలను చూస్తే వాగులను, వంకలను తలపించేలా ఉన్నాయని, ఇలాంటి పనికిరాని స్థలాలను ప్రజలకు ఇచ్చి వైసీపీ ప్రజలను మోసం చేస్తోందని.. ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ జగనన్న కాలనీల పరిస్థితిని ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నామని.. ప్రజలు ఉచితాలను చూసి మోసపోకూడదని నిజానిజాలను గ్రహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జనసేన నాయకులు సాయి ప్రదీప్ రెడ్డి మరియు జనసైనికులు ఫరూక్, చిన్న, రవి, పవన్,
సుంకన్న, నాగరాజు, జుబేర్, భారత్, మున్నా పాల్గొన్నారు.