డొక్కా సీతమ్మ మరియు మదర్ థెరిస్సా స్ఫూర్తితో మజ్జిగ చలివేంద్రం

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, అడ్డతీగల మండలం, డొక్కా సీతమ్మ మరియు మదర్ థెరిస్సా స్ఫూర్తితో మంగళవారం అడ్డతీగల హెడ్ క్వార్టర్ లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మంగళవారం సంత కావడంతో చుట్టుపక్కల నుంచి వచ్చే జనానికి 50 లీటర్ల చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల గ్రామం వాసులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, కట్టా ప్రసాద్, అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.