దేవీ నవరాత్రుల వేడుకలలో బత్తుల దంపతులు

  • మునికూడలి గ్రామంలో అమ్మవారిని దర్శించుకున్న బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో దేవీ నవరాత్రుల వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి. అనంతరం ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారు. తర్వాత మునికూడలి గ్రామ జనసైనికులతో బత్తుల బలరామకృష్ణ కాసేపు చర్చించారు‌. అమ్మవారి మండపానికి బత్తుల దంపతులు 5,000/- రూపాయల విరాళాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన శ్రేణులు మరియు మునికూడలి జనసైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

  • సీతానగరం గ్రామంలో అమ్మవారిని దర్శించుకున్న బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో నవరాత్రుల వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలని దినదినాభివృద్ధి చెందుతున్న జనసేన పురోగతి ఇంకా పెరగాలని అలాగే నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన శ్రేణులు మరియు సీతానగరం జనసైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.