పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన బత్తుల..

రాజానగరం: కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, నా సేన కోసం నా వంతు కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలో పర్యటించి, పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, కొందరికి ఆర్థిక సహాయం అందించి, తన మంచి మనసును మరో మారు చాటుకున్నారు… వివరాలు ఇలా ఉన్నాయి

*అడ్డాల పెద్దకాపు కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుని వారిని పరామర్శించి.. వైద్య ఖర్చు నిమిత్తం రూ.5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

*కాళ్ళ సుబ్బారావు కు అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ ఖర్చులు నిమిత్తం రూ. రూ.5,000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

*ఘోష రాముడు గారికి అనారోగ్య సమస్యతో ఉన్న వారిని పలకరించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ… రూ.5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమాల్లో మట్ట నాగేశ్వరావు, ప్రగడ జోగారావు, ప్రగడ దేవి, అడ్డాల దుర్గారావు, బొజ్జపు సత్యనారాయణ, చదువు శీను, ఇంటి కృష్ణ, కలవపల్లి వీరబాబు, తాతాజీ త్రిపురశెట్టి, మద్దిరెడ్డి బాబులు, సేనాపతి మహేష్, పుణ్యక్షేత్రం మరియు సంపత్ నగరం జనసైనికులు మరియు నరసాపురం జనసైనికులు పాల్గొన్నారు.