కిడ్నీ వ్యాధి బాధితునికి ఆర్థిక సహాయం

పలాస నియోజకవర్గం, మందస మండలంలో సొండిపుడి గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి రెండు కిడ్నీలు పాడవడంతో కిడ్నీ మార్పిడి కోసం అయ్యే ఖర్చు పెట్టుకొనే స్థోమత లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హెచ్.ఎస్.ఆర్.ఎ (హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్) సంస్థ వారు రూ. 4600 పవన్ కళ్యాణ్ సేవా సంస్థ తరపున రూ. 3500 ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు హరిక్రిష్ణ, జనసైనికులు ప్రశాంత్ పాల్గొన్నారు. హెచ్.ఎస్.ఆర్.ఎ మనోజ్ కుమార్, అహెక్ శ్రీకాంత్, సాలీనా పాపారావు, మధు, మిగతా గ్రూప్ సభ్యులకు క్రిష్ణారావు ధన్యవాదాలు తెలిపారు. అదేవిదంగా ప్రశాంత్ కి సాయం చేస్తున్న వేరే సంస్థల వారికి, సోషల్ మీడియా మిత్రులకు & స్నేహితులకు చేతులు జోడిస్తూ ధన్యవాదాలు అని పదిమందిని కలుపుకొని పదిమందికి సాయం చేయడమే సంస్థ లక్ష్యం అని క్రిష్ణారావు తెలిపారు.