రాజానగరం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో కిల్లడి సుబ్బారావు కుమారుడు కిల్లడి శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం స్థానిక జనశ్రేణులు ద్వారా తెలుసుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. అనంతరం రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాత వెలుగుబంధ గ్రామంలో కత్తి శేఖర్(పాస్టర్) కుమార్తె కత్తి మహిమ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ. అనంతరం రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాత వెలుగుబంధ గ్రామంలో డేగల సూరిబాబు తల్లి కీ.శే డేగల సుబ్బలక్ష్మి ఇటీవల పెరాలిసిస్ స్ట్రోక్ కారణంగా మృతి చెందిన విషయం స్థానిక జనశ్రేణులు ద్వారా తెలుసుకుని వారి కుటుంబం సభ్యులను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, దివాన్ చెరువు గ్రామ జనసేన పార్టీ నాయకులు, పాత వెలుగుబంధ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.