పాత వెలుగుబంధ గ్రామంలో జనం కోసం జనసేన మహా పాదయాత్ర

రాజానగరం, “జనం కోసం జనసేన మహా పాదయాత్ర” గురువారం రాజానగరం మండలం, పాత వెలుగుబంద గ్రామంలో భాగంగా జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళుతూ ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం అవుతూ రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, పాత వెలుగుబంద గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.