పవన్ కళ్యాణ్ తో బత్తుల మర్యాదపూర్వక భేటీ

  • మంచి మెజారిటీతో రాజానగరం నియోజకవర్గాన్ని గెలిపించాలని బత్తుల కు సూచించిన అధినేత

మంగళగిరి: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ని రాజానగర నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమించి, ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రం మొత్తం రాజానగరం నియోజకవర్గం వైపే చూసేలా చేసి, అదే సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా నీ,నా అనే భేదం లేకుండా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకతీతంగా ఎందరో పేద ప్రజలకు ఆర్థిక సహాయ సహకారాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సేవా తత్పరుడుగా ఉన్నతమైన ఖ్యాతిని గడించిన, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాబోవు ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని నిలబెడుతూ.. కార్యకర్తలందరినీ సమన్వయంతో ముందుకు తీసుకు వెళుతూ.. వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ.. అవినీతి, అరాచక పాలనతో పెట్రేగిపోతున్న వైసీపీని గద్దె దించి.. రాజానగరం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించే విధంగా కృషి చేయాలని పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరి వెంట జిల్లా కార్యవర్గ సభ్యులు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, కొత్తపల్లి రఘు, అడ్డాల శివ చక్రవర్తి.. రాజానగరం మండల కన్వీనర్ వేగిశెట్టి రాజు, సీనియర్ నాయకులు అడపా శ్రీనివాస్, గాదంశెట్టి వెంకన్న, గుర్రాల చలం పాల్గొన్నారు.