Pithapuram: ఉదారత చాటుకున్న శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో సోమవారం కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో ఒక యువకుడు మరణించడం జరిగింది, ఆ బాధ తట్టుకోలేక ఆ కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు యువకుడు అన్నయ్య విచారంలో ఉండటం అన్నం తినక పోవడం వల్ల కడుపు నొప్పి రావడంతో ఆపరేషన్ జరిగిందని జన సైనికుడు దాసరి దేవదాస్ వారు పడుతున్న ఇబ్బందులు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి వారికి చెప్పడం జరిగింది, వెంటనే ఆ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి మనో ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. మళ్లీ ఆ కుటుంబ సభ్యులను ఈరోజు ఇసుకపల్లి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోగా వారి తల్లిదండ్రులకు ఆరోగ్య పరిస్థితి బాగుండటం లేదని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీమతి శేషుకుమారి ధనసహాయం, రైస్ బ్యాగ్ ను అందచేశారు మళ్లీ ఒక నెల రోజుల్లో వస్తానని మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని భరోసా ఇస్తూ ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, దాసరి దేవదాస్, అనపర్తి కిరణ్, అనపర్తి విజయ్,అడప శివరామకృష్ణ, దడాల బాబి, దడాల బాబ్జి, కొంచె రంగ, దాసరి హరీష్, దాసరి తాతాజీ, దాసరి శ్రీనివాసరావు, అనపర్తి హన్తుం,రేవాడ కిరణ్, రేవాడ ప్రభుదాస్, తిరగడ బాల ప్రసాద్, దడాల రాంబాబు, దడాల నిఖిల్, కొండపల్లి శివ, మేడిశెట్టి కామేష్, గాది క్రాంతి, మేడిశెట్టి కిషోర్, ఉలవల పండు,జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.