డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో కళ్ళకు గంతులు కట్టుకుని గాంధీ విగ్రహం ముందు నిరసన

పిఠాపురం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమనికి రావడం జరిగింది అయితే ఊహించని రీతిలో జనం రావడం వల్ల తట్టుకోలేని వైసీపీ ప్రభుత్వం ఈరోజు జనవాణి కార్యక్రమం జనసమూత్రంతో నిండి ఎక్కడైతే సక్సెస్ అవుతుందనే భయంతో అర్ధరాత్రి దొంగల్లాగా పోలీసులను పంపించి పవన్ కళ్యాణ్ ని కలవడానికి వచ్చిన జనసేన నాయకులను, జనసైనికులను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా కళ్ళకు గంతులు కట్టుకుని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపడం జరిగింది డాక్టర్ శ్రీధర్ గారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఓడిపోతాననే భయంతో ఓటమిని ఒప్పుకోలేక ఎదుటివాడి గెలుపుని నాశనం చేసే విధంగా ఈ వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అక్రమ అరెస్టులను తక్షణమే విడుదల చేయాలని వైసీపీ ప్రభుత్వాని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి రాజు, చిన్న శశిధర్, పలివెల నాని బాబు, సొడే రవికుమార్, ఆకుల లావరాజు, వంక జాన్ ప్రసాద్, పెనుపోతుల వీరబాబు, పల్లెటి జాన్సన్, మైలపల్లి రవి, గంపల సత్తిరాజు, వంకా కొండబాబు, చింతకాయల పూరి, మైలపల్లి రాజు, మెరుగ రవికుమార్, షోడే మహేష్, జ్యోతుల శివ, జి వెంకటరావు, రాశిపల్లి రమణ మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.