ఇఫ్తార్ వేడుకల్లో పాల్గొన్న బొర్రా

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ళ గ్రామంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు వేడుకల్లో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొనడం జరిగింది. మొదటిగా ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ముస్లింలతో పాటు నమాజ్ లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మత పెద్దల ఆశీర్వచనాలు అందుకున్న బొర్రా వెంకట అప్పారావు. దేశంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకల్లో భాగమైన ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు అన్నారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు తానే స్వయంగా ఆహారాన్ని వడ్డించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కౌన్సిలర్, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, జనసైనికులు, వీర మహిళ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.