జనసేన వరదయ్య పాలెం మండల జనసేన కమీటీ

సత్యవేడు నియోజకవర్గం, వరదయపాలెం మండలంలో వరదయ్య పాలెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ అధ్వర్యంలో జనసేన-టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎంపి వరప్రసాద్ రావు వెలగపల్లితో జనసేన పార్టీ మండల కమిటీ పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ మాట్లాడుతు వరప్రసాద్ రావు వెలగపల్లి ఉన్నత విద్యావంతులు వారిని గెలిపించుకుంటే నియోజకవర్గ ప్రజల కోసం బాధ్యతగా పనిచేస్తారు మనం అందరం జనసేన, టీడీపీ, బిజెపి ఉమ్మడి ఎంపి అభ్యర్థి వరప్రసాద్ రావు వెలగపల్లిని గెలిపించు కోవలన్ని చేప్పడం జరిగింది. జనసేన పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ కొప్పుల లావణ్య కుమార్ మాట్లాడుతు యువత అందరూ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించండి మీ భవిష్యత్ కి ఉమ్మడి ప్రభుత్వ గ్యారంటీ ఇస్తుంది. జనసేన, టీడీపీ, బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని, ఎంపి అభ్యర్థి వరప్రసాద్ రావు వెలగపల్లిని గెలిపించు కోవాలని చెప్పడం జరిగింది. జనసేన, టీడీపీ, బిజెపి ఉమ్మడింఫ్ అభ్యర్థి వరప్రసాద్ రావు వెలగపల్లి మాట్లాడుతు నేను కేవలం ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను ప్రజలపై జరుగుతున్న అక్రమాలు ఎదుర్కోవడం కోసమే నేను రాజకీయం చేస్తున్నాను నన్ను గెలిపించి మీరు పార్లమెంట్ కి పంపించండి సత్యవేడు నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి నేను పరిష్కరిస్తాను నా గెలుపుకు మీరు పని చేయండి మీ భవిష్యత్తుకు నేను గ్యారెంటీ ఇస్తాను. త్రాగునీరు సమస్య నుంచి పాఠశాల సమస్యల వరకు వీధిలైట్లు నుంచి వ్యవసాయానికి నీరు వరకు సిసి రోడ్ల నుంచి ఉన్నత విద్యా అర్హత వరకు అన్ని సమస్యలకు నేను పరిష్కారం చూపుతాను ఈ అన్ని సమస్యల పరిష్కారం కావాలంటే నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించండి అని మండల అధ్యక్షుడు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం, మండల ఉపఅధ్యక్షులు తులసిరామ్, టి.ఎస్.శీరిష మండల నాయకులు కులశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యంపళ్ళ వెంకటేష్, వసంత్ కుమార్, కార్యదర్శులు వినోద్, సంయుక్త కార్యదర్శులు ప్రసాద్, పృధ్వి, పరశురామ్ , కార్యకర్తలు ముణిరత్నం, జర్జీ, గుణ, వినయ్, విజయ్, భరత్, ఉమేష్, తేజ, కార్తీక్, రాఘవేంద్ర, తులసి, జ్యోతి, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.