డిజిటల్ కాంపెయిన్ లో బూసాయివలస గ్రామ జనసైనికులు

విశాఖ ఉక్కు పరిరక్షణ కై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపుమేరకు జనసేన పార్టీ డిజిటల్ కాంపెయిన్ లో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం బూసాయివలస గ్రామంలో జనసైనికులు నిరసన తెలియజేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఏ అధికారం లేని జనసేన చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25మంది MP లు ఏమి చేస్తున్నారు అనేది అది మీరు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి. ఇప్పుటికైనా మేల్కోని విశాఖ ఉక్కు కోసం పోరాడుతారు అని కోరుకుంటున్నాము. జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా బూసాయివలస గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ, పార్టీ ని ప్రజల లోకి ఎలా తీసుకువెళ్లాలి అని చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ జిల్లా పార్లమెంట్ కమిటీ సభ్యులు సంచాన గంగధర్, హరి సంతుగ, పడాల చినబాబు, చీమల సతీష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.