జగ్గయ్యపేట జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

జగ్గయ్యపేట నియోజకవర్గం, చిలకల్లు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చిలకల్లు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికులు ఏర్పాటు చేసిన చలివేద్రం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకల్లు వేదాద్రి రోడ్ జనసైనికులు, యువత భారీగా పాల్గొని అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, జగ్గయ్యపేట మండల అధ్యక్షులు తులసి బ్రహ్మం పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.