గుంటూరు జనసేన ఆధ్వర్యంలో ఉచిత ధర్మ చలివేంద్రం

గుంటూరు తూర్పు నియోజకవర్గం పాత గుంటూరు(8వ వార్డు) లో జడ సురేష్ ఆధ్వర్యంలో ఉచిత ధర్మ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే జడ సురేష్ జన్మదినం సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జనరల్ సెక్రటరీ నారదాసు ప్రసాద్, సతీష్, మదులాల్, అన్నం వెంకట్రావు, ఉలవల వెంకటేశ్వరరావు, బాలు, లక్ష్మిశెట్టి రమేష్, లక్ష్మిశెట్టి శంకర్, మాధవ లు పాల్గొన్నారు.