పవన్ కళ్యాణ్ పర్యటన సన్నాహక సమావేశం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన జనసైనికుల కుటుంబాలను పరామర్శించేందుకు రానున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబందించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మేకల సతీష్ రెడ్డి. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, యువజన, విద్యార్థి, వీర మహిళా విభాగం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.