స్వాతంత్ర్య అమృతోత్సవాల్లో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన చెన్నారెడ్డి మనుక్రాంత్
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ శ్రీహరి నగర్ లోని జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ గావించారు.
ఈ సందర్బంగా వారు స్వతంత్ర కోసం పోరాడిన సమరయోధుల స్ఫూర్తి తో దేశ ప్రజలందరూ సమసమాజ స్థాపనకు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతో పాటు నగర అధ్యక్షుడు సుజయ్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాథ్యక్షులు సుధీర్ బద్దిపూడి, జిల్లా అధికార ప్రతినిధి కలువాయి సుధీర్, నగర కార్యదర్శి ఉమాదేవి అజయ్ బాబు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.