గ్రామ గ్రామానా తేనిటీ విందు

  • కోరుకొండ మండలంలో రెండవ రోజు తేనిటీ విందు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ గ్రామం జన జాగృతి యాత్ర ఈ కార్యక్రమానికి ప్రజల ప్రజలా ఆదరణతో ముందుకు సాగుతుంది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప కీలకపాత్ర వహిస్తున్న ఈ తేనిటీ విందు కార్యక్రమంలో కోరుకొండ మండలం అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండలం అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండల అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, తెలగంశెట్టి శివ, గదరాడ జనసేన నాయకులు గళ్ళా సతీష్, అరుబోలు బాలుతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ… జనసేన పార్టీ గుర్తు అయినా గ్లాజు గ్లాసుతో తేనిటీ ఇవ్వడం జరిగింది దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ వ్యాహం ముద్రించిన కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.