జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి నియోజకవర్గం, మంగళగిరి మండలం చినకాకాని గ్రామంకు చెందిన మన జనసైనికుడు లింగినేని మల్లేశ్వరరావు తల్లి లింగినేని పద్మా శనివారం ఉదయం మృతి చెందటం జరిగింది. లింగినేని పద్మకి జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులతో జనసేన పార్టీ తరుపున సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.