శ్రీ కన్యక కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం, టీ నర్సాపురం మండలం, టీ నర్సాపురం గ్రామంలో మహాశివరాత్రి మరియు 28 వ కళ్యాణ మహోత్సవము సందర్బంగా శ్రీ కన్యక కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయ కమిటీ మరియు టిడిపి నాయకులు జనసేన నాయకులు ఆహ్వానం మేరకు ఆదివారం పోలవరం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిర్రి బాలరాజు దర్శనం చేసుకున్నారు. తదనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాసగాని వెంకటేశ్వరావు ఇంటి వద్ద స్థానిక టీడీపీ నాయకులను కార్యకర్తలను కలిసి వారి మద్దతు కోరడం జరిగింది. మిగిలిన నాయకులను మరి కొద్ది రోజులలోనే కలిసి వారి అందరి మద్దతు కోరడం జరుగుతుందని ఈ సందర్బంగా అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అడప నాగరాజు, జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.