బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం

పార్వతీపురం నియోజకవర్గం, బలిజిపేట మండలంలో, కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థ నెహ్రూ యువ కేంద్ర సంస్థ యొక్క ప్రతినిథులు లక్ష్మణ్, గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, ఎంఆర్ ఓ శర్మ, ఎస్ ఐ ఆఫ్ పోలీస్ ప్రసన్న మరియు మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు వాలీబాల్ మరియు కబడ్డీ ఆటలలో గెలుపొందిన యువతీ యువకులకు మొమెంటోస్ అందజేసారు. ఈ కార్యక్రమంలో హరిచరణ్, ఆదినారాయణ ఎన్ పీ, పరుచూరి రమణ, పాలూరు వెంకటేష్, ప్రగడ కళ్యాణ్, అచ్యుత్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.