టీడీపీ కార్యకర్తల మృతికి గుడ్లూరు జనసేన దిగ్భ్రాంతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా, కందుకూరు నియోజకవర్గంలో బుధవారం జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభకు తరలివచ్చిన కార్యకర్తలలో 8 మంది మృత్యువాత పడటం, పలువురికి గాయాలయి ఆసుపత్రి పాలవడం పట్ల గుడ్లూరు మండల జనసేన తీవ్ర దిగ్భ్రాంతికి గురై తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను. దయచేసి పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సభలకు కార్యకర్తలను తరలించేటప్పుడు గ్రామాల నుంచి తరలించడం దగ్గర నుంచి, మళ్ళీ తిరిగి గ్రామాలకు చేరుకునే వరకూ సంయమనం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఏదిఏమైనా ఈ ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ గుడ్లూరు మండల జనసేన నాయకులు మూలగిరి శ్రీనివాస్, అనిమిశెట్టి మాధవ రావు, అన్నంగి చలపతి, ఆలా శివ, కంఠా హజరత్తయ్య, రాజేష్, అమోస్, రాంబాబు తదితరులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.