జ‌న‌సేన పార్టీ బ‌లోపేతానికి నిరంత‌ర‌ కృషి: నేరెళ్ళ సురేష్

గుంటూరు జిల్లాలో జ‌న‌సేన పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు నిరంత‌రం కృషి చేస్తాన‌ని ఆ పార్టీ నేత నేరెళ్ళ సురేష్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆయ‌న జ‌న‌సేన పార్టీలో చేరిన సంద‌ర్భంగా ఝ్శ్ఫ్ రాయ‌ల్ సోల్జ‌ర్స్ వ్యవస్థాపకులు అన్న‌దాసు వెంక‌ట సుబ్బారావు ఆధ్వ‌ర్యంలో సురేష్ ను స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అభివృధ్ధే లక్ష్యంగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని, నేడు ఆ పార్టీతో క‌ల‌సి ముందుకు సాగ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. రాష్ట్రంలో ఏన్నో ఏళ్లగా పరిష్కారం కాని సమస్యలకు పవన్ కళ్యాణ్ కొత్తదారి చూపారన్నారు. ఏక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అక్కడ పవన్ ప్రత్యక్షమయ్యి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతున్నారన్నారు. అవినీతి రహిత, ఓటుకు నోటు లేని రాజకీయాల కోసం పవన్ నిరంతరం పోరాడుతారన్నారు. ప్రత్యేక హోదా, ఉద్దానం కిడ్నీ బాధితుల ఇబ్బందులు, అగ్రికల్చర్ విద్యార్ధుల సమస్యలు, చేనేత కార్మికుల కష్టాలు, యూనివర్సిటీ విద్యార్ధుల ఆర్తనాదాలు, ఇలా ఏన్నో సమస్యలకు పవన్ అడ్డుకట్ట వేసారన్నారు. 2024 ఎన్నికల్లో అధికార పార్టీకి, ప్ర‌తిప‌క్ష పార్టీకి ముచ్చెమట‌లు ప‌ట్టించ‌డం ఖాయ‌మని తెలిపారు. పవన్ ఆశయ సాధన కోసం జన సైనికులంతా నిరంతర కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికై ముందుకు రావాలన్నారు. నిత్యం పవన్ కళ్యాణ్ ప్రజాభివృధ్ధి కోసమే పోరాడుతారు తప్ప పదవుల కోసం కాదన్నారు. పవన్ లాంటి నిజాయితీ నాయకుడు మనకు దొరకటం మన అదృష్టమన్నారు. భవిష్యత్తులో పవన్ వల్లే రాష్ట్రాభివృధ్ధి సాధ్యమవుతుందన్నారు.