జనంకోసం జనసేన 273వ రోజు

  • 1200 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్న జనంకోసం జనసేన 273వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో 1200 దానిమ్మ మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 40700 దానిమ్మ మొక్కల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, రామవరం ఎంపిటిసి దొడ్డ శ్రీను, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు చిట్టీడి రామారావు, గ్రామ ఉపాధ్యక్షులు సుంకర శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి సాంబారు వరప్రసాద్, బంగారు రామస్వామి, నార్ల దిని నారాయణ, గొంప సురేష్, కేసారపు రెడ్డి, షేక్ రెహమాన్, కొల్లి విజయ్ కుమార్, గంధం వీర వెంకట సతిష్, కందా రాఘవేంద్ర, చక్కపల్లి సతీష్, జోగాడ సురేష్, ఏపూరి రాజు, ప్రగడరెడ్డి చరణ్ తేజ, వెన్న మనోజ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ కృతజ్ఞతలు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 272వ రోజు కాట్రావులపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన శివుడు పాపారావు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.