జనసేన ప్రజా చైతన్య యాత్ర 34వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన ప్రజా చైతన్య యాత్ర 34వ రోజు కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో ఆదివారం రామభద్రపురం మండలం, అరికితోట పంచాయతీ, దుప్పలపూడి గ్రామంలో గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి, సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కర్యక్రమంలో ఉల్లి సంతోష్, అప్పారావు, మురళి, మరియు రామభద్రపురం మండలం జనసైనికులు పాల్గొనడం జరిగింది.