ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జనసేనానితోనే సాధ్యం: జానీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన జానీ మాట్లాడుతూ అవినీతి రాజకీయ నాయకులను, మరియు అవినీతి ప్రభుత్వ అధికారులను ఏరిపారేసే నిజమైన నిఖార్సయిన నిష్పక్షపాత నీతి నిజాయితీ గల యువతీ యువకులు దేశం కోసం పనిచేసే జనసైనికులు, వీరమహిళలు, నాయకులు ఇప్పుడు అవసరం. కొత్త తరం కొత్త నాయకత్వం దేశానికీ రాష్ట్రానికి కావాలి. అది జనసేన పార్టీలో ఐతే ప్రజలకి మంచి జరుగుతుంది. జనంకోసం జనసేన, ప్రజలు కోసం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అసలైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనసేన జానీ పిలుపునివ్వడం జరిగింది.