అరకు నియోజకవర్గంలో డిజిటల్ క్యాంపెయిన్

జనసేనపార్టీ అధ్యక్షుడు గౌ. శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైసీపీ ఎంపిలు పార్లమెంట్ లో ప్రస్తావించాలని సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ మూడు రోజుల్లో బాగంగా చివరి రోజు హుకుంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ చేస్తే జనసేనపార్టీ చూస్తూ ఊరుకోదు.. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన అధినేత మాట ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంలా ఈ కార్యక్రమం జరిగిందని ఇప్పటికైనా ఎంపి లు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో ప్రస్తావించి, ప్రయివేటి కారణ ఆపాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డా.వంపూరు గంగులయ్య పాల్గొని ప్రసంగించారు. అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు, మండల నాయకులు కోటేస్వరరావు, పడల్ రాంబాబు, నాగరాజు, కమల్, మురళి కృష్ణ, అశోక్ తదితరులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని నిరసన తెలిపారు.