గుంతకల్ పట్టణంలో డిజిటల్ క్యాంపెయిన్

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన డిజిటల్ క్యాంపెయిన్ ఉదృతంగా సాగుతోంది. #Raise_Placards_YSRCP_MP హ్యాష్ ట్యాగ్ తో వైసీపీ పార్లమెంటు సభ్యులను ట్యాగ్ చేస్తూ అనంతపురం జిల్లా, గుంతకల్ పట్టణంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీలకీతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకునే వరకు జనసేన పార్టీ ఉద్యమిస్తుందని తెలిపారు.