నందిగామలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

నందిగామ నియోజకవర్గం: చందర్లపాడు మండలం, తుర్లపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణలో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది అనే కార్యక్రమాన్ని నందిగామ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సీఎం జగన్ గారు పాదయాత్ర పేరిట ప్రతి రోడ్డు మీద నడిచినప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ల సంవత్సరాల రోడ్లు చాలా అద్వానంగా మారాయి. బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం ఉంది. ఈ జగన్ వచ్చాక గుంతల రాజ్యాన్ని చూస్తున్నాం.. నందిగామ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఆటోలో ప్రయాణించాలంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తాడేపల్లి పాలేస్ వదిలి గ్రామాల్లో ఇప్పుడు నడిస్తే ప్రజలు ఏ విధంగా మీకు సమాధానం చెప్తారో అర్థమవుతుంది. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆంధ్రప్రదేశ్ కు మంచి భవిష్యత్తు ఇస్తామని రమాదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పామర్రు నియోజకవర్గ సమన్వయకర్త కోట వీరబాబు, జనసేన మండల అధ్యక్షుడు వడ్డెల్లి సుధాకర్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మేకల సుధాకర్, జనసేన ఉపాధ్యక్షుడు పురంశెట్టి నాగేంద్ర, గ్రామ టిడిపి అధ్యక్షులు దాసరి ప్రభు, నందిగామ రూరల్ పార్టీ జనసేన అధ్యక్షులు కుడుపుగంటి రామారావు, వీర్లపాడు మండల అధ్యక్షుడు బేతంపూడి జయరాజు, తదితర జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ జనసైనికులు, పవన్ ఆర్మీ పెద్దఎత్తున పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.