కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

తదిపత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితులను ప్రజలకు మరియు ముఖ్యమంత్రికి తెలిసేలా పవన్ కళ్యాణ్ తలపెట్టిన #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా మొదటిరోజున తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలోని పీర్లమాన్యం మరియు సజ్జలదిన్నె బ్రిడ్జి వద్ద అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పరిశీలించి వాటి ఫోటోలు మరియు వీడియోలు పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కిరణ్, సునీల్, అయూబ్, రసూల్, నాగార్జున, రాహుల్, మణికంఠ, అబ్దుల్, షెక్షా, హేమంత్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.