వరదయ్యపాలెంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సత్యవేడు నియోజకవర్గం: వరదయ్యపాలెం మండలంలో ఆదివారం క్రియాశీలక సభ్యత్వ కిట్లను మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ వాలంటీర్లు మరియు జనసైనికులకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ కార్యకర్తల క్షేమం గురుంచి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ప్రమాదంలో గాయపడితే 50 వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శేఖర్, తులసీరామ్, కమిటీ సభ్యులు వెంకటేష్, ప్రసాద్, యుగందర్ తదితరులు పాల్గొన్నారు.