తంగెల్ల ముసలయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఇండిపెండెంట్ గా గెలిచిన గ్రామ సర్పంచ్ తంగెల్ల ముసలయ్యను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలు చర్చించి, మారుతున్న రాజకీయ పరిస్థితులను, గ్రామంలో సమస్యలను రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.