రణస్థలం మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలంలో.. కోచ్చేర్ల, సూర్యనారాయణ పురం, యామలపేట, నీలమ్మపేట గ్రామాలలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. జనసేన పార్టీ నాయకులు మరియు వాలంటీర్ గా పనిచేసిన పోట్నూరు లక్ష్మునాయుడు ఆధ్వర్యంలో.. బస్వసూరి చేతులు మీదుగా జనసైనికులకి సోమవారం క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పూర్తి ప్రజల్లో ప్రతి రోజు ఉండాలని.. ప్రజలకు అండగా ఉండాలని కళ్యాణ్ చేసిన సేవాకార్యక్రమాలు ప్రజల్లో ప్రతి ఒక్కరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమణ, కలివరపు కృష్ణ, సూర్యనారాయణ, యాగాటి రమణ, కలిశెట్టి చిన్నంనాయుడు, ఉంగరాడ కేశవ ఆ గ్రామ జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.