తిమ్మాపురంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కళ్యాణదుర్గం: కంబదూరు మండలం, తిమ్మాపురం పంచాయతీలో మండల అధ్యక్షులు చంద్ర మౌళి, నరేష్, సురేష్, మునీంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాయకులు, జనసైనికులు వీరమహిళలు ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల, నాయకుల కుటుంబ సభ్యులుగా భావించి వారి బాగోగులు దృష్టిలో ఉంచుకుని అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు వారి కుటుబసభ్యులకు అండగా నిలవాలని భావించి ప్రమాద భీమా చేయించడం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారి కుటంబసభ్యులకు 5 లక్షలు, ప్రమాదంలో గాయపడిన వారికి 50 వేలు ఆసుపత్రి ఖర్చులకు ఇస్తున్నందుకు అధ్యక్షులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రియశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా మిత్రా పక్షాలతో ఎలా కలిసి పనిచేయాలి అనే విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ కంబదూరు మండల ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనివాసులు, వెంకటేష్, నరసింహ మూర్తి, వీరమహిళ శ్రావణి, మండల నాయకులు హరిప్రసాద్, బాషా, తిప్పేస్వామి, రాంప్రసాద్, గండి కోట జగదీష్, శ్రీకాంత్, ముక్కన్న, అనిల్, ప్రదీప్, రవి లింగమూర్తి, ఏర్రిస్వామి, ప్రకాష్, సీన మొదలైన జనసైనికులు పాల్గొన్నారు.