విద్యుత్ ఘాతంతో భార్య భర్తలు మృతి చెందిన కుటుంబానికి జనసేన పరామర్శ

*విద్యుత్ ఘాతానికి గురై భార్య భర్తలు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన జనసేన సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, శ్రీ రాములు

అరకు నియోజకవర్గ కేంద్రంలో గల విద్యుత్ శాఖ క్వార్టర్స్ లో భార్యా భర్తలు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన గొల్లోరి దొంబు, భార్య గొల్లోరి పార్వతి కుటుంబాన్ని బుధవారము జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. జనసేన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నియోజక వర్గ కేంద్రంలో గల కంఠ బౌన్స్ ల గూడాలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా, మాదల శ్రీ రాములు, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వీధిలో ఉన్న డ్రైనేజ్ ని పరిశీలించారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆ వీధిలో ఉన్న ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనసైనికులు సంతోషి, గతుం లక్ష్మణరావు, కిల్లో రాజా, భరత్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.