ఒక్క రూపాయి నిధులివ్వని జగన్ మనకు అవసరమా?

  • జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్

అనంతపురం: ప్రభువా ఈ బిడ్డ అబద్ధపు మాటలను ఆపలేవా.. నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని నోటితో పలికినంత మాత్రాన వారి జీవితం అభివృద్ధి చెందదు. ఈ బిడ్డకు ఏమన్నా చిత్తశుద్ధి అనేది ఉందా.. ఎస్సీలకు కార్పొరేషన్ నిధులను వేరొక దానికి వాడుకొని వారిని అన్యాయం చేసినది నిజం కాదా. ఈ బిడ్డ నా బీసీలు అంటూ బీసీలను కులాల వారీగా విడగొట్టి వారికి కులాల పేరుతో కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి నిధులు ఇవ్వని ఈ బిడ్డ మనకు అవసరమా అని అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం చంద్రశేఖర్
నా మైనార్టీలు అంటూ నాలుగున్నర సంవత్సరంలో కనీసం వారికి ఇస్తానన్న దుల్హన్ పథకం కూడా ఇవ్వలేనటువంటి ఈ బిడ్డ మాటలతో ఏం మార్చాలని చూస్తున్నాడు. ఈ బిడ్డకు డాక్టర్ సుధాకర్ గారి గురించి సుగాలి ప్రీతి గురించి అనంత బాబు దాష్టీకంకు బలై కొరియర్ రూపంలో ఇంటికి మృతదేహాన్ని పంపిన సుబ్రహ్మణ్యం గురించి. అక్కకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి తోటలో వైసీపీ మంటకు గురైన తమ్ముడు గురించి తెలీదా ఈ బిడ్డకు.. ఈ బిడ్డకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ అన్యాయాలు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది.. ఇక రైతుల విషయంలో పగటిపూట 9 గంటల విద్యుత్తు రైతులకు ఇస్తున్నానని అనటం ఒక పచ్చి అపద్దం రైతులకు కరెంటు పగలు మూడు గంటలు రాత్రి మూడు గంటలు ఇస్తూ రైతులను తీవ్ర ఇబ్బంది పాలు చేసింది ఈ బిడ్డ కాదా? రైతులకు ఒక లక్ష 75 వేల కోట్లు ఇచ్చారన్నారు. ఏ విధంగా ఇచ్చారో రైతులకు ఒక మీటర్ డ్రిప్ వైరనివ్వలేని ఈ బిడ్డ. సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఇవ్వలేని ఈ బిడ్డ. ఎరువులు ఇవ్వలేని ఈ బిడ్డ.. ఇవన్నీ ఇస్తానన్న ఆర్ బి కే లను కేవలం వైసీపీ ప్రచారాలకు తప్పితే రైతులకు ఏ విధంగా ఉపయోగపడలేదు. ఇక పాడి రైతుల విషయంలో అముల్ తెచ్చి పాడి రైతులకు మేలు చేశానని చెప్పే ఈ బిడ్డ తెలివి ఏ పాటిదో మీరే ఆలోచించండి. పాల ఉత్పత్తి పెరిగితేనో పాల ధర పెరిగితేనో అభివృద్ధి అంటారు. కానీ పేరు యజమాని మారినంత మాత్రాన అభివృద్ధి జరగదు అని ఈ బిడ్డకు తెలియదా. సమగ్ర భూ సర్వే ద్వారా పేద రైతుల భూములకు చుక్కల భూములుగా మార్చి సరిహద్దు తగాదాలు పెట్టి బూటకపు సర్వేల పేరుతో ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు కాజేస్తున్నారు. ఈ బిడ్డ ప్రతిపక్షాల వారు చేసే స్కాముల గురించి తెలపడం బాగుంది మరి ఈ బిడ్డ 16 నెలలు జైల్లో ఎందుకు ఉన్నారో తెలపాలి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేశా.. పోలవరం కోసం పోరాటాలు చేశా.. లేక ఆంధ్ర ప్రజల ధనాన్ని కాజేశా తెలపాలి. ఈ బిడ్డ బటన్ నొక్కడమే కాదు పోలవరం ప్రాజెక్టు ను త్వరితగతిన నిర్మించి రైతులకు నీరు అందించాలని. అలాగే అనంతపురం జిల్లాలో కేసి కెనాల్ క్రింద పొలం ఉన్న రైతులు పూర్తిగా అన్యాయంపై పోయారు. వారికి హ్ణ్శ్శ్ ద్వారా అయినా నీరు అందించాలని జనసేన పార్టీ కోరుతోంది. గజదొంగ ముఠాలను తయారు చేస్తుందే ఈ బిడ్డ.కొండలను గుట్టలను మింగే మాఫియా. లిక్కర్ మాఫియా. ఇసుక మాఫియా. గంజాయి మాఫియా. ఎర్రచందనం మాఫియా లుగా ఉన్న వ్యక్తుల సమూహమే వైసీపీ. ఇలాంటి వారి నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం తెలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రశేఖర్ పేర్కొన్నారు.