జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘

విశాఖ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం కేజీహెచ్ వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటలకి జరిగింది. ఈ యొక్క కార్యక్రమం జనసేన పార్టి సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం జనసేన ముఖ్య నాయకులు గోపి కృష్ణ(జికె) చేతుల మీదుగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసిన సురేష్ గారికి, సేనాపతి దుర్గా ప్రసాద్ కి(సాలాపు సింహాచలం గారి జ్ఞాపకార్థం) అలాగే మచ్చ రాజు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో వీరమహిళలు ఎన్.నాగమణి, సంతోషి, జనసైనికులు రఘు, గణేష్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.