జనసైనికుల ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రాలు ప్రారంభం

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో శ్రీమతి డొక్కా సీతమ్మ చలివేంద్రాలు సంకిలి, మజ్జిరముడుపేట గ్రామాల్లో మజ్జిక పంచి ప్రారంభించారు. రోజురోజుకి పెరుగుతున్న ఎండలు దృష్టిలో ఉంచుకొని పాదచారులకు, వాహనదారులకు, పరిసర ప్రాంత ప్రజలు తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసామని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.