కుల మతాలకతీతంగా డాక్టర్ కందుల సేవలు

విశాఖ దక్షిణం, నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం 37వ వార్డు నియోజకవర్గంలో పుష్పవతి అయిన గురు దివ్యకు దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పట్టుబట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నియోజకవర్గం పర్యటనలో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ కులమతాలకు అతీతంగా తన సేవలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు. అర్హులైన ప్రతి పేదవారిని ఆదుకోవడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గరికిన రవి, హేమ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.