తిరుపతి జనసేనలోకి భారీ చేరికలు

తిరుపతి: జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారని నమ్మి బిజెపి, వైసిపి, కాంగ్రెస్ పార్టీల నుంచి గురువారం తిరుపతిలో గుట్టా నాగరాజ రాయల్, రమేష్ నాయుడు, శేషారత్నం, రమనయ్య, సుబ్రహ్మణ్యం, సుకుమార్, శేషారెడ్డి, గురు, రమేష్, శ్రీహరి, సుబ్బయ్య, రామ్ గోపి, కిరణ్ కుమార్, శివ, చిట్టి బాబు తదితరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏ ఒక్క అవినీతి రాజకీయ మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు సుమారు 30 కోట్ల రూ సొంత నిధులను పంచి పెడుతున్నారని, రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నూతనంగా చేరిన నాయకులు ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి మరియు ముఖ్య నేతలు మాట్లాడుతూ.. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి చేరికలు జరుగుతాయని ఇది ఆరంభం మాత్రమేనని రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ జనసేన వైపు చూస్తున్నారని రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని దిశా నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర, జిల్లా, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.