సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన డిఎస్సీ క్వాలిఫై టీచర్లు

అమరావతి: అధికారం చేపట్టక ముందు జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలంటూ 1998 డిఎస్సీ క్వాలిఫై ఉపాధ్యాయులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. తమకు ఈ హామీ ఇచ్చి 22 నెలలైందని, జగన్‌ అధికారం చేపట్టి రెండు సంవత్సరాలవుతోందని, అయినా ఇప్పటికీ తమ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న క్వాలిఫై ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు.