పొన్నలూరు మండల జనసేన నాయకుల ముందస్తు అరెస్టు

కొండెపి: ఇసుక అక్రమంగా తవ్వకాలు చేస్తున్నటువంటి వారిని అడ్డుకునేందుకు గుంటూరు జిల్లా అధ్యక్షులు జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు పిలుపు మేరకు, ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది జనసైనికులతో సోమవారం ఉదయం చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లడానికి నిర్ణయించుకున్న తరుణంలో, చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళకూడదు అంటూ పొన్నలూరు మండలం ఎస్ ఐ దాసరి రాజారావును ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది.
మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు కర్ణ తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు పెయ్యల రవికుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చౌడూరి ఖాదర్ బాషా, కార్యదర్శి సుంకేశ్వరం శ్రీను, కార్యదర్శి కాకాని ఆంజనేయులు మొదలైన ముఖ్యమైన పొన్నలూరు మండలం జనసేన నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది.